ఆగస్టు 15 వేడుకలకు కరోనా యోధులు.. మరోసారి అరుదైన గౌరవం

A salute to the 'Corona Warriors' - YouTube

కరోనా యోధులకు మరోసారి గౌరవం కల్పించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధమయ్యాయి. కరోనా యోధులతో పాటు కరోనాను జయించిన వారిని వేడుకలకు ప్రత్యేక ఆహ్వానితులుగా పిలవాలని కేంద్ర సూచించింది.

కరోనా మహమ్మారితో ముందు వరుసలో ఉండి పోరాడుతున్న యోధులకు మరోసారి సముచిత గౌరవం అందించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధమవుతున్నాయి. కొవిడ్ సంక్షోభ కాలంలో అత్యవసర, విశేష సేవ‌లు అందించిన క‌రోనా వారియ‌ర్స్‌ను ఆగ‌స్టు 15న స్వాతంత్య్ర వేడుక‌ల‌కు ప్రత్యేక ఆహ్వానితులుగా పిల‌వాల‌ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర ప్రభుత్వం సూచించింది. వైద్యులు, ఆరోగ్య సిబ్బంది, పారిశుద్ధ్య సిబ్బంది, కరోనా కట్టడికి కృషి చేస్తున్న ఇతర అధికారులు, సిబ్బందికి ఈ గౌరవం కల్పించాలని సూచించింది. వీరితో పాటు కరోనా నుంచి కోలుకున్నవారినీ ప్రత్యేక ఆహ్వానితులుగా పిలవాలని పేర్కొంది.

క‌రోనా మహమ్మారి నేప‌థ్యంలో స్వాతంత్ర్య వేడుక‌ల‌పై కేంద్ర ప్రభుత్వం గురువారం మార్గద‌ర్శకాలు జారీ చేసింది. రాష్ట్ర రాజ‌ధాని ప్రాంతాల్లో ఉద‌యం 9 గంట‌ల‌కు వేడుక‌ల‌ను నిర్వహించాల‌ని సూచించింది. వైరస్ వ్యాప్తి దృష్ట్యా వేడుకల్లో పరిమిత సంఖ్యలో పాల్గొనేలా చూడాలని నిర్దేశించింది. భారీ స్థాయిలో జ‌నం పాల్గొన‌కుండా చూడాలని కోరింది.

జిల్లా కేంద్రాల్లో నిర్వహించే వేడుకలకు, గ్రామ పంచాయతీలకు కూడా ఇవే నిబంధనలు వర్తిస్తాయని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. స్వాతంత్య్ర దినోత్సవం రోజు రాజ్‌భవన్‌లో నిర్వహించే ఎట్‌హోం కార్యక్రమం నిర్వహణపై నిర్ణయాన్ని గవర్నర్లకే వదలిపెట్టింది.

కరోనా యోధులకు భారత త్రివిధ దళాలు ఇప్పటికే ఘనంగా జేజేలు పలికిన విషయం తెలిసిందే. కొవిడ్ ఆస్పత్రులపై పూలవర్షం కురిపించడం ద్వారా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ గౌరవం సమర్పించగా.. ఇండియన్ నేవీ యుద్ధ నౌకలపై దీపాలు వెలిగించింది.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.