ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం రిజిస్ట్రేషన్‌ చేసుకోండి..!

బీఈ, బీటెక్, బీఫార్మసీ, ఎంసీఏ, ఎంబీఏ, పీజీడీఎం, బీఏ, బీఎస్సీ, బీకాం, బీసీఏ, బీబీఎం, బీబీఏ, ఎంఏ, ఎంఎస్సీ, ఎంకామ్, పాలిటెక్నిక్ కోర్సుల్లో మొదటి, రెండో, మూడో, నాలుగో సంవత్సరాల్లో చదువుతున్న విద్యార్థులు రిజిస్టర్ చేసుకోవచ్చు. 2020-21 విద్యా సంవత్సరంలో టాస్క్‌తో రిజిస్టర్ అయిన విద్యార్థులు దరఖాస్తు చేయవచ్చు. ఇందులో రిజిస్టర్ చేసుకోవడానికి, పరీక్షల్లో వచ్చిన మార్కుల శాతానికి సంబంధం లేదు. విద్యార్థులు ఎవరైనా రిజిస్టర్ చేసుకోవచ్చు. అయితే ఉద్యోగాలకు నియమించే కంపెనీలు కోరుకున్న విద్యార్హతలు ఉన్న వారికి మాత్రమే ప్లేస్‌మెంట్ ప్రక్రియలో పాల్గొనే అవకాశం లభిస్తుంది.

 విద్యార్థులు టాస్క్‌లో రిజిస్టర్ చేసుకుంటే వారికి పరిశ్రమ సంబంధిత కోర్సులు అందుబాటులో ఉంటాయి. సాఫ్ట్ స్కిల్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్కిల్స్ నేర్చుకోవచ్చు. ఇంటర్న్‌షిప్ అవకాశాలు లభిస్తాయి. పలు సంస్థలు నిర్వహించే ప్లేస్‌మెంట్ డ్రైవ్స్‌లో పాల్గొనొచ్చు.


రిజిస్ట్రేషన్ కోసం బీఈ, బీటెక్ చదువుతున్న జనరల్, ఓబీసీ విద్యార్థులు రూ.1416.. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.708.. అలాగే డిగ్రీ, ఎంసీఏ, ఎంబీఏ, పీజీడీఎం, పీజీ, ఫార్మసీ చదువుతున్న జనరల్, ఓబీసీ విద్యార్థులు రూ.590.. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.295, పాలిటెక్నిక్ విద్యార్థులు రూ.295 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. డిసెంబర్ 27 దరఖాస్తుకు చివరి తేదీ.


ఇప్పటికే టాస్క్‌లో రిజిస్టర్ చేసుకున్న విద్యార్థులు మళ్లీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు. ఒక్కసారి టాస్క్‌లో రిజిస్ట్రేషన్ చేసుకుంటే చాలు. మరిన్ని వివరాలకు https://www.task.telangana.gov.in/ వెబ్‌సైట్‌లో చూడొచ్చు.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.